Vijayawada: విజయవాడలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు!

Vijayawada: విజయవాడలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.

Ramana, Penamaluru
Published on: 4 Sept 2026 9:20 AM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు!

Vijayawada: తూర్పు, ఎన్‌టీఆర్ జిల్లా: కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ శ్రీకృష్ణాష్టమి అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

విజయవాడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న కేశినేని చిన్ని మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి బోధనలు ఒక కులానికో, ఒక మతానికో పరిమితం కాదని, యావత్ మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అందుకే కృష్ణాష్టమి కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కచోట చేర్చే మహోన్నత పండుగగా నిలుస్తోందని తెలిపారు.

సేవా కార్యక్రమాల్లో బహుదూర్ ప్రత్యేక ముద్ర

మాజీ కార్పొరేటర్ బహుదూర్ ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్‌కు అందిస్తున్న సేవలను ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేకంగా అభినందించారు. భక్తి భావంతో పాటు సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తూ ఆలయానికి, భక్తులకు అవసరమైన సేవలను అందించడం ప్రశంసనీయమన్నారు. ప్రజా జీవితంలో పదవుల కంటే సేవే ముఖ్యమని నిరూపించేలా బహుదూర్ చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయని కొనియాడారు.

కూటమి ప్రభుత్వంలో పండుగలకు కొత్త వైభవం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతి పండుగను ప్రజలు మరింత ఉత్సాహంగా, వైభవంగా జరుపుకుంటున్నారని కేశినేని చిన్ని అన్నారు. పండుగలు కేవలం ఆచార వ్యవహారాలుగా కాకుండా ప్రజల మధ్య ఐక్యతను చాటే వేడుకలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.

విజయవాడలో కృష్ణాష్టమి వేడుకలు భక్తి, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా భక్తుల సందడి నెలకొంది.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story