Vijayawada: ఏపీలో తొలిసారిగా అమరావతి పికిల్బాల్ లీగ్ ప్రారంభం!
Vijayawada: విజయవాడలో ఆగస్టు 7 నుంచి 9 వరకు జరగనున్న అమరావతి పికిల్బాల్ లీగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆహ్వానించారు.
Vijayawada: ఏపీలో తొలిసారిగా అమరావతి పికిల్బాల్ లీగ్ ప్రారంభం!
Vijayawada: అమరావతి పికిల్బాల్ లీగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆగస్టు 7 నుంచి 9 వరకు విజయవాడలో జరగనున్న లీగ్
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నిర్వహిస్తున్న అమరావతి పికిల్బాల్ లీగ్ (AMPL) ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనాలని మంత్రికి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గద్దె క్రాంతి కుమార్ ఆహ్వానం తెలిపారు.
ఆగస్టు 7 నుంచి 9 వరకు విజయవాడలోని నైట్రో పికిల్బాల్ & కేఫే వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలో పికిల్బాల్ క్రీడాభివృద్ధికి ఈ లీగ్ ఒక మైలురాయిగా నిలవనుండగా, దేశంలోని ప్రముఖ ఆటగాళ్లు, ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
Next Story




