News Anlysis: రైతు బంధు రీ-డిజైన్ అవసరం.. బడా శ్రీమంతులకు చెక్ పెట్టాలి!
News Anlysis: రైతులకు సబ్సిడీలు ఇవ్వాల్సిందే కానీ అర్హులకు మాత్రమే అందాలని బిజెపి నేత విట్టల్ అన్నారు.
News Anlysis: తెలంగాణ హైకోర్టు ఇటీవల ఉచిత పథకాలు, అర్హతలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై నిర్వహించిన హెచ్ఎమ్టీవీ (hmtv) పొలిటికల్ న్యూస్ ఎనాలసిస్లో బీజేపీ నాయకుడు విట్టల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక అయిన రైతులకు ప్రభుత్వం ఎంత సాయం చేసినా తక్కువేనని, అయితే సంక్షేమ పథకాలు నిజమైన నిరుపేదలకు, అవసరమున్న వారికే దక్కేలా 'రేషనలైజేషన్' (వర్గీకరణ/సమగ్ర సమీక్ష) జరగాలని స్పష్టం చేశారు.
వ్యవసాయం ఫ్యాక్టరీ ఉత్పత్తుల వంటిది కాదని, అర్ధరాత్రి కష్టపడే రైతులకు విదేశాల తరహాలోనే 100% సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వంలో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, అలాగే లగ్జరీ కార్లు ఉన్న బడా శ్రీమంతులకు కూడా రైతు బంధు చెక్కులు ఇవ్వడం పెద్ద లోపమని విమర్శించారు.
Next Story




