ఎస్బీఐ కోర్టు పిటిషన్ వెనుక కేంద్ర మంత్రి హస్తం.. కాంగ్రెస్ నేత మానవతా రాయ్ సంచలన వ్యాఖ్యలు!
SBI vs Telangana Govt: తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటూ రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నాయకుడు మానవతా రాయ్ తీవ్రంగా ఆరోపించారు.
ఎస్బీఐ కోర్టు పిటిషన్ వెనుక కేంద్ర మంత్రి హస్తం.. కాంగ్రెస్ నేత మానవతా రాయ్ సంచలన వ్యాఖ్యలు!
SBI vs Telangana Govt: తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటూ రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నాయకుడు మానవతా రాయ్ తీవ్రంగా ఆరోపించారు. గతంలో కేటాయించిన భూమి వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కోర్టును ఆశ్రయించడం వెనుక ఒక కేంద్ర మంత్రి ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
2010లో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్బీఐ సంస్థ ప్రధాన కార్యాలయం మరియు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం కోట్ల విలువైన భూమిని తక్కువ రాయితీ ధరకే కేటాయించింది.
కేటాయింపులు జరిగి 12 ఏళ్లు గడిచినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2022లో అప్పటి ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసింది. దీనిపై ఎస్బీఐ కోర్టుకు వెళ్లగా, ప్రభుత్వం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో ప్రత్యామ్నాయ భూమి ఇస్తామని చెప్పడంతో వారు అంగీకరించి పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిని ప్రభుత్వ హక్కుల ప్రకారం ఎకరాకు ₹235 కోట్ల చొప్పున విజయవంతంగా వేలం వేసిన తర్వాత, ఎస్బీఐ మళ్లీ కోర్టుకు వెళ్లడం వెనుక రాజకీయ ప్రలోభాలు మరియు దురుద్దేశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.




