Big Debate: నీట్ పేపర్ లీకేజీపై BRS మౌనం వెనుక నిజమేంటి? హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్‌లో బిఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు!

Big Debate: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై బిఆర్ఎస్ మౌనం వహిస్తోందన్న విమర్శలపై హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్‌లో స్పందించిన బిఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్.

Arun Chilukuri
Published on: 23 July 2026 11:31 AM IST
Big Debate
X

Big Debate: నీట్ పేపర్ లీకేజీపై BRS మౌనం వెనుక నిజమేంటి? హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్‌లో బిఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు! 

Big Debate: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం, ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై ప్రతిపక్ష బిఆర్ఎస్ (BRS) పార్టీ ఎందుకు గట్టిగా స్పందించడం లేదన్న ప్రశ్నలపై 'హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్' వేదికగా వేడివేడిగా చర్చ జరిగింది. ఈ డిబేట్‌లో పాల్గొన్న బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లం మల్లయ్య యాదవ్ తమ పార్టీ విధానాన్ని స్పష్టం చేయడంతో పాటు కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.

డిబేట్‌లో యాంకర్ ప్రశ్నిస్తూ.. "దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, అందులోనూ తెలంగాణకు చెందిన సుమారు లక్ష మంది విద్యార్థులు నీట్ లీకేజీ వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఢిల్లీలో విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పోరాడుతుంటే బిఆర్ఎస్ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు?" అని నిలదీశారు.

దీనికి బొల్లం మల్లయ్య యాదవ్ సమాధానమిస్తూ.. విద్యార్థులు తమ కుటుంబంలో భాగమని, వారి నష్టానికి బిఆర్ఎస్ ఎంతగానో ఆవేదన చెందుతోందని తెలిపారు. జాతీయ స్థాయిలో పార్లమెంట్‌లో తమ పార్టీ ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నందున తమ స్వరం ఢిల్లీకి గట్టిగా వినపడకపోవచ్చని, అంతమాత్రాన తాము మౌనంగా ఉన్నట్లు కాదని వివరణ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గాల వారీగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story