News Analysis: హామీలు ఇచ్చి ఉద్యోగులను, ప్రజలను మోసం చేస్తున్నారు: బీజేపీ నేత యెండెల లక్ష్మీనారాయణ

News Analysis: ఎన్నికల హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, ఉద్యోగులను మోసం చేస్తోందని బీజేపీ నేత ఎండల లక్ష్మీనారాయణ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 2 Sept 2026 12:02 PM IST
News Analysis
X

News Analysis: హామీలు ఇచ్చి ఉద్యోగులను, ప్రజలను మోసం చేస్తున్నారు: బీజేపీ నేత యెండెల లక్ష్మీనారాయణ 

News Analysis: ఎన్నికల సమయంలో ప్రజలకు, ఉద్యోగులకు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మండిపడ్డారు. హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో భాగంగా మేనిఫెస్టో హామీల అమలు తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరిచి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం సరికాదని, ఇది ప్రజలను, చైతన్యవంతమైన ఉద్యోగులను మోసగించడమేనని స్పష్టం చేశారు.

పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి విఫలమైన ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story