News Analysis: ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: కాంగ్రెస్ నేత గౌరీ సతీష్

News Analysis: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ నేత గౌరీ సతీష్ తెలిపారు.

Arun Chilukuri
Published on: 2 Sept 2026 12:17 PM IST
News Analysis
X

News Analysis: ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: కాంగ్రెస్ నేత గౌరీ సతీష్

News Analysis: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత గౌరీ సతీష్ స్పష్టం చేశారు. హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో భాగంగా ఉద్యోగుల డిమాండ్లు, పీఆర్సీ, ఓపీఎస్ అంశాలపై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు కనీసం తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండేనని విమర్శించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టామని, జిపీఎస్ నిధులు విడుదల చేయడంతో పాటు పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను దశలవారీగా తీర్చమన్నారు.

317 జీవో బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story