News Analysis: ప్రతి స్కీమ్‌ బంద్‌.. మేనిఫెస్టో అమలు ఏది?: బీఆర్‌ఎస్‌ నేత రాకేష్

News Analysis: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు బంద్ అయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో హామీలను విస్మరించిందని బీఆర్‌ఎస్‌ నేత రాకేష్ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 2 Sept 2026 11:53 AM IST
News Analysis
X

News Analysis: ప్రతి స్కీమ్‌ బంద్‌.. మేనిఫెస్టో అమలు ఏది?: బీఆర్‌ఎస్‌ నేత రాకేష్

News Analysis: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను నిలిపివేసిందని, ఇచ్చిన మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత డాక్టర్ రాకేష్ చిరుమల్ల విమర్శించారు. హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో భాగంగా ఉద్యోగుల సమస్యలు, ఓపీఎస్ (OPS), సీపీఎస్ (CPS) అంశాలు మరియు ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన మాట్లాడారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని, పాత పెన్షన్ విధానం (OPS) మరియు డీఏల విషయంలో ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

పెండింగ్‌లో ఉన్న డిఏలు, పిఆర్సి (PRC) అమలు, హెల్త్ కార్డ్‌ల జారీ వంటి విషయాల్లో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story