News Analysis: ఒక్కరోజు సెలవు లేకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు: కాంగ్రెస్ నేత ఇంద్ర శోభన్

News Analysis: సీఎం రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం 24 గంటలు పని చేస్తున్నారని..

Arun Chilukuri
Published on: 1 Sept 2026 12:11 PM IST
News Analysis
X

News Analysis: ఒక్కరోజు సెలవు లేకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు: కాంగ్రెస్ నేత ఇంద్ర శోభన్

News Analysis: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 32 నెలల పాలనా కాలంలో కనీసం ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా, అహర్నిశలు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్ర శోభన్ పేర్కొన్నారు. hmtv నిర్వహించిన డిబేట్‌లో ఆమె బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలను తిప్పికొట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి రోజులో కొన్ని గంటలు కూడా విశ్రాంతి తీసుకోకుండా, ప్రజాక్షేత్రంలో ఉంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు నడిపిస్తున్నారని ఇంద్ర శోభన్ స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేతగా ఎన్నికై ఉండి కూడా అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యలపై గళం విప్పకుండా కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే ఆ పదవి ఎందుకని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో జీతాలు, అలవెన్సులు తీసుకుంటూ సభకు హాజరు కాని పక్షంలో బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలో తప్పేముందని సమర్థించుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story