News Analysis: పవర్ కోసం ఇంత చీప్ రాజకీయాలా? కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ ఫైర్!

News Analysis: రాజకీయ ప్రయోజనాల కోసం క్షుద్ర పూజలంటూ దిగజారుడు ఆరోపణలు చేసుకోవడం సరికాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ సీనియర్ నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 12:30 PM IST
News Analysis
X

News Analysis: పవర్ కోసం ఇంత చీప్ రాజకీయాలా? కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ ఫైర్!

News Analysis: తెలంగాణ రాజకీయం ప్రస్తుతం క్షుద్ర పూజలు, లీగల్ నోటీసుల చుట్టూ తిరగడంపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికారం కోసం, ఒకరిని ఒకరు తక్కువ చేసి చూపించుకోవడం కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు చేసుకుంటున్న ఆరోపణలు అత్యంత చౌకబారుగా ఉన్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ విమర్శించారు. హెచ్‌ఎమ్‌టీవీ (HMTV) నిర్వహించిన ప్రత్యేక ‘న్యూస్ అనాలసిస్’ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.

క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలు చేసుకోవడం, వెంటనే ప్రెస్ మీట్లు పెట్టడం, లీగల్ నోటీసులు పంపడం వంటివి ప్రజల జీవితాలకు ఏమాత్రం ఉపయోగపడని అంశాలని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కేవలం పేపర్లు, టీవీల్లో పబ్లిసిటీ పొందేందుకే ఇలాంటి బేస్‌లెస్ చర్చలు పెడుతున్నారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story