ప్రతి గింజ కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ది.. కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి ఫైర్!
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం, ఐకేపీ సెంటర్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ నాయకుడు దిలీప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. hmtv డిబేట్ పాల్గొన్న ఆయన, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టారు.
ఎన్నికల ప్రచారంలోనూ, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ‘ఎంతైనా వరి పండించుకోండి.. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనే బాధ్యత మాది’ అని రేవంత్ రెడ్డి బహిరంగంగా హామీలు ఇచ్చారని దిలీప్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కేవలం ఏడు రకాల సన్న వడ్లకే బోనస్ పరిమితం చేస్తూ నిబంధనలు పెట్టడం రైతులను వంచించడమేనని మండిపడ్డారు.
Next Story




