News Analysis: చావు డప్పులు, శుద్ధి రాజకీయాలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు: బీజేపీ నేత విఠల్

News Analysis: అసెంబ్లీ నిరసనల పేరుతో చావు డప్పు కొట్టడం, శుద్ధి కార్యక్రమాలు చేయడం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 10 Sept 2026 12:42 PM IST
News Analysis
X

News Analysis: చావు డప్పులు, శుద్ధి రాజకీయాలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు: బీజేపీ నేత విఠల్

News Analysis: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరియు రాజకీయ పరిణామాలపై HMTV నిర్వహించిన డిబేట్‌లో బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజలు తలదించుకునేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చట్టసభలు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదికలని, కానీ ఇక్కడ అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దూషించుకోవడం, దాడులు చేసుకోవడం దారుణమని విఠల్ మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, రైతుల సమస్యలు మరియు హైదరాబాద్‌ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story