News Analysis: పెన్షన్ల ఎంపికలో రాజకీయం వద్దు.. ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ హెచ్చరిక!

News Analysis: తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల మంజూరుపై బిజెపి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ విశ్లేషణ.

Arun Chilukuri
Published on: 4 Aug 2026 11:45 AM IST
News Analysis
X

News Analysis: పెన్షన్ల ఎంపికలో రాజకీయం వద్దు.. ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ హెచ్చరిక!

News Analysis: తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు, వయోవృద్ధులు మరియు ఆసరా లేని వారికి అందించే ఆసరా పెన్షన్ల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు లేదా కార్యకర్తల ప్రమేయం లేకుండా, నేరుగా గ్రామసభలు నిర్వహించి అత్యంత నిరుపేదలను గుర్తించి పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) నిర్వహించిన ‘న్యూస్ ఎనాలసిస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచార సమయంలో పెన్షన్ల మొత్తాన్ని పెంచుతామని, ఒకే ఇంట్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. కానీ ప్రభుత్వం సగం పదవీ కాలం పూర్తయ్యాక కూడా పరిమిత సంఖ్యలోనే కొత్త పెన్షన్లు ఇస్తామని అనడం సరికాదని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story