Renigunta: గణేష్ నగర్లో ఘనంగా సంతాన గంగమ్మ తల్లి జాతర!
Renigunta: రేణిగుంట గణేష్ నగర్లో సంతాన గంగమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. బీజేపీ నేత కోలా ఆనంద్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
Renigunta: గణేష్ నగర్లో ఘనంగా సంతాన గంగమ్మ తల్లి జాతర!
రేణిగుంట: గణేష్ నగర్లో సంతాన గంగమ్మ తల్లి జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ జాతరలో భాజపా నాయకుడు కోలా ఆనంద్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అరుణ్ కుమార్,మదన్ ఆధ్వర్యంలో కోలా ఆనంద్కు ఘన స్వాగతం పలికారు.
జాతర సందర్భంగా ఉదయం నుంచే అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి, పొంగళ్లను సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాతర అనంతరం సాయంత్రం గణేష్ నగర్లో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు కోలా ఆనంద్ పాటు రేణిగుంట పట్టణ బిజెపి నాయకులు వేణు ముదిరాజ్ రాజా రాయల్, అరుణ్ కుమార్, గుణశేఖర్, మదన్, స్టెల్లా, మల్లిక, వరప్రసాద్, దేవయాని తదితరులు పాల్గొన్నారు.




