Puttur: పుత్తూరు తెల్లగుట్ట అటవీ ప్రాంతంలో 64 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Puttur: తిరుపతి జిల్లా పుత్తూరు పరిధిలోని తెల్లగుట్ట అటవీ ప్రాంతంలో 64 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. అటవీ అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన స్మగ్లింగ్ దందా.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 24 Aug 2026 8:13 PM IST
Puttur
X

Puttur: పుత్తూరు తెల్లగుట్ట అటవీ ప్రాంతంలో 64 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Puttur: తిరుపతి జిల్లా,పుత్తూరు మండల పరిధిలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టివేత.టీఆర్‌ కండ్రిగ అటవీ ప్రాంతంలో తెల్లగుట్ట వద్ద దాచి ఉంచిన 64 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖాధికారులు.రహస్య సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు.

అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను గుర్తించిన అధికారులు.అధికారుల రాకను గమనించి స్మగ్లర్లు అక్కడి నుంచి పరార్‌.పరారైన స్మగ్లర్ల కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అటవీ శాఖ అధికారులు.

ఈ కార్యక్రమం లో ఫారెస్ట్ రేంజ్ అధికారి మాధవి,పుత్తూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవి రావు, నారాయణ వనం బీట్ అధికారి నూర్ అబ్జల్ లాల్వ, డమాల పేట బీట్ అధికారి కుమారస్వామి అధికారులు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story