Renigunta: సౌత్ ఇండియన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ – విజేతగా డేవిడ్ అరకోణం టీమ్!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే ఇన్‌స్టిట్యూట్ గ్రౌండ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో డేవిడ్ అరకోణం టీమ్ విజేతగా నిలిచింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 9 Aug 2026 10:25 PM IST
Renigunta
X

Renigunta: సౌత్ ఇండియన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ – విజేతగా డేవిడ్ అరకోణం టీమ్!

రేణిగుంట: రేణిగుంట రైల్వే ఇన్స్టిట్యూట్ ఫుట్ బాల్ గ్రౌండ్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న సౌత్ ఇండియన్ ఫుడ్ బాల్ టోర్నమెంట్ రసవతారం గా సాగింది ఫైనల్స్ వచ్చిన డేవిడ్ అరకోణం టీం విజేతగా నిలిచారు.

తిరుపతి డైనమోస్ టీం రన్నర్స్ గా నిలిచారు ఈ టోర్నమెంట్ నందు మొదటి బహుమతి 80000/- రూపాయలు, రన్నర్స్ టీంకు 50,000 బహుమతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మొదటి బహుమతి ప్రభాకర్ వైసిపి రేణిగుంట పట్టణ అధ్యక్షులు విజేతలు డేవిడ్ అరకోణం టీంకు బహుమతి ప్రధానం చేశారు.

ద్వితీయ బహుమతి గోపి అర్జున్ మరియు గోపీలు మంగళం వారు రన్నర్స్ తిరుపతి డైనమోస్ టీంకు బహుమతి ప్రధానం చేశారు. ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన కమిటీ మెంబర్లు మునిరత్నం, దేవ, సుధాకర్, విజయ్ కుమార్ రాజేష్ లను క్రీడాకారులు స్థానికులు అభినందించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story