Renigunta: గంజాయి రహిత సమాజమే లక్ష్యం.. రంగంలోకి దిగిన ఈగల్ టీమ్
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట ఆర్టీసీ బస్ స్టాండ్లో గంజాయి వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Renigunta: గంజాయి రహిత సమాజమే లక్ష్యం.. రంగంలోకి దిగిన ఈగల్ టీమ్
రేణిగుంట: రేణిగుంట ఆర్టీసీ బస్ స్టేషన్లో గంజాయి మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఈగల్ సీఐ ప్రసాద్ రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర పాల్గొని ప్రయాణికులు,యువతకు గంజాయి వినియోగం ఆరోగ్యానికి, భవిష్యత్తుకు హానికరమని వివరించారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుందని సీఐ తెలిపారు.
Next Story




