Renigunta: అమర రాజాలో వార్షిక వైద్య పరీక్షలు ప్రారంభం!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలోని అమర రాజా సంస్థ అమర హాస్పిటల్ భాగస్వామ్యంతో వార్షిక వైద్య పరీక్షలు–2026 ప్రారంభించింది.
Renigunta: అమర రాజాలో వార్షిక వైద్య పరీక్షలు ప్రారంభం!
రేణిగుంట: ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం, నివారణాత్మక వైద్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అమర రాజా సంస్థ వార్షిక వైద్య పరీక్షలు–2026ను అమర హాస్పిటల్ భాగస్వామ్యంతో బుధవారం ప్రారంభించింది.
ఈ ఏడాది తొలిసారిగా 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న ఉద్యోగులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ప్రవేశపెట్టారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని గత పరీక్షల ఫలితాలతో పోల్చుకునేలా *‘వైటాలిటీ ఇండెక్స్’*ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
దేశవ్యాప్తంగా సుమారు 24,020 మంది ఉద్యోగులు ఈ వైద్య పరీక్షలకు అర్హులు కాగా, సంస్థకు చెందిన ఐదు తయారీ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో వైద్య సహాయం అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
కార్యక్రమంలో అమర హాస్పిటల్ చైర్మన్ డా. ప్రసాద్ గౌరినేని, మేనేజింగ్ డైరెక్టర్ డా. రామాదేవి గౌరినేని, అమర రాజా సీఎస్ఓ ప్రశాంత్ తివారీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.




