BJP MLAs: సింగరేణి గనుల్లో నేడు బీజేపీ బృందం పర్యటన.. బొగ్గు కుంభకోణంపై క్షేత్రస్థాయి పరిశీలన!
BJP MLAs: సింగరేణి బొగ్గు కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.
BJP MLAs: సింగరేణి గనుల్లో నేడు బీజేపీ బృందం పర్యటన.. బొగ్గు కుంభకోణంపై క్షేత్రస్థాయి పరిశీలన!
BJP MLAs: సింగరేణి బొగ్గు కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ వ్యవహారంలో వాస్తవాలను తేల్చేందుకు బీజేపీ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సింగరేణి గనుల్లో పర్యటించనుంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించనుంది.
హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న బీజేపీ నేతల బృందం 11 గంటలకు మంచిర్యాలలోని సింగరేణి గెస్ట్ హౌస్ కు చేరుకోనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాంపూర్ ఓపెన్ మైన్, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు SRP-3 మైన్ ను సందర్శించి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిశీలించనుంది.
Next Story




