Rangam Bhavishyavani: రంగం భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత.. ఈ ఏడాది కుంభవర్షాలు!
Rangam Bhavishyavani: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగింపు ఘట్టంలో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు.
Rangam Bhavishyavani: రంగం భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత.. ఈ ఏడాది కుంభవర్షాలు!
Rangam Bhavishyavani: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా ముగింపు ఘట్టానికి చేరుకుంది. జాతరలో ఎంతో కీలకమైన, భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే 'రంగం' కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మాతంగి స్వర్ణలత అమ్మవారి ప్రతిరూపంగా పచ్చికుండపై నిలబడి భవిష్యవాణిని వినిపించారు.
రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపిస్తూ మాతంగి స్వర్ణలత తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను సంతోషంగా లేను.. తీవ్ర కోపంతో వచ్చాను. మీ ప్రశ్నలకు నేనెందుకు సమాధానం చెప్పాలి? ఏటా నేను చెప్తున్న మాటలను మీరు ఏమైనా ఆచరిస్తున్నారా?" అంటూ ప్రశ్నించారు. ప్రజల ప్రవర్తన, భక్తిశ్రద్ధల పట్ల అమ్మవారు ఆగ్రహంతో ఉన్నట్లు భవిష్యవాణి ద్వారా సూచించారు.
వాతావరణం, పంటల పట్ల భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఈ ఏడాది వర్షపాతం సమృద్ధిగా ఉంటుందని, కుంభవర్షాలు కురిసే అవకాశం ఉందని భవిష్యవాణిలో పేర్కొన్నారు. వర్షాలు విస్తారంగా పడి ప్రాజెక్టులు నిండుతాయని సూచించారు.
రంగం కార్యక్రమం పూర్తి కావడంతో బోనాల జాతర చివరి ఘట్టానికి చేరింది. భవిష్యవాణి వినేందుకు మరియు అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు. రంగం ముగిసిన అనంతరం అమ్మవారి శాంతి కళ్యాణం, దేవి ప్రతిమను ఏనుగు అంబారీపై ఉంచి నగర వీధుల్లో వైభవంగా ఊరేగించే ఘట్టం ప్రారంభమైంది. భక్తుల శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ సికింద్రాబాద్ పురవీధులు మారుమోగిపోతున్నాయి.




