Karimnagar: చొప్పదండి ఎమ్మెల్యే గర్జన: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
Karimnagar: అసెంబ్లీలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గళం. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని, రామడుగు రోడ్లకు నిధులు ఇవ్వాలని కోరారు.
Karimnagar: చొప్పదండి ఎమ్మెల్యే గర్జన: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
కరీంనగర్ జిల్లా: సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని అన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ ఎత్తు పెంపు నేపథ్యంలో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా రామడుగు మండలంలో దెబ్బతిన్న రహదారుల పరిస్థితిని ప్రస్తావించిన ఎమ్మెల్యే, వెంటనే మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడితే ప్రజల దైనందిన జీవనం సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయితే పరిసర గ్రామాలకు సాగునీటి సమస్యలు తగ్గి రైతులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని తెలిపారు. మొత్తం మీద ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు.




