Jagtial: వ్యాస రచనలో మన విద్యార్థులు మేటి ఆదర్శ పాఠశాలలో సంబరాలు
Jagtial: టాటా బిల్డింగ్ ఇండియా నిర్వహించిన "ఆత్మనిర్భర్ భారత్" వ్యాస రచన పోటీల్లో జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాల విద్యార్థులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు.
Jagtial: వ్యాస రచనలో మన విద్యార్థులు మేటి ఆదర్శ పాఠశాలలో సంబరాలు
Jagtial: టాటా బిల్డింగ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాల విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు
" ఆత్మ నిర్భర భారత్ నిర్మాణంలో నా కర్తవ్యం" అనే అంశం పై నిర్వహించిన పోటీలో సీనియర్ విభాగలో కె.లక్ష్మి ప్రసన్న ప్రథమ ఎ. శ్రీగౌతమి ద్వితీయ,
టి. చందన తృతీయ స్థానం సాధించి బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు.
జూనియర్ విభాగంలో జి. అరునిమ,
ప్రథమ ఎల్. వెన్నెల ద్వితీయ,
బి. కీర్తన,తృతీయ స్థానం సాధించి బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు.
విద్యార్థులకు పతకాలతో పాటుగా ప్రశంస పత్రాలు అందజేశారు. పతకాలు గెలుచుకున్న విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ బి. లావణ్య అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటుగా ఉపాధ్యాయులు వెంకట రమణ, మల్లేశం, ప్రమోద,శ్రీధర్, మహేందర్,అనుప్ రెడ్డి,సత్యానందం,సుధారాణి, సౌజన్య, అంజలి విద్యార్థులు పాల్గొన్నారు.




