Ramchander Rao: కేంద్ర నిర్ణయం చారిత్రాత్మకం.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 'వ్యాట్' తగ్గించాలి
Ramchander Rao: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
Ramchander Rao: కేంద్ర నిర్ణయం చారిత్రాత్మకం.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 'వ్యాట్' తగ్గించాలి
Ramchander Rao: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది సామాన్య ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అందించిన గొప్ప కానుక అని ఆయన కొనియాడారు.
కేంద్రం కీలక నిర్ణయాలు:
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా సున్నా (₹0) కి తగ్గించడం, పెట్రోల్పై రూ. 10 తగ్గించడం సామాన్యులకు పెను ఊరటనిస్తుందన్నారు. "ఖజానా నింపుకోవడం కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యం" అని భావించే ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్:
తెలంగాణలో పెట్రోల్ ధరలు అధికంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక వ్యాట్ (VAT) కారణమని రామచందర్ రావు విమర్శించారు. కేంద్రం తన వంతుగా ధరలు తగ్గించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గనుక వ్యాట్ తగ్గించినట్లయితే, తెలంగాణలో పెట్రోల్ ధర రూ. 100 లోపు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయంపైనే కాకుండా, ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
తక్షణమే రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యి పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గించే నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున బీజేపీ పోరాడుతుందని ఆయన హెచ్చరించారు.




