Sultanabad: సుల్తానాబాద్‌లో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు

Sultanabad: సుల్తానాబాద్ రూరల్ మండలంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 6:00 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్‌లో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు

Sultanabad: సుల్తానాబాద్ రూరల్ మండల పరిధిలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు పరిధిలోని పలు గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగరవేసి, మిఠాయిలు పంచుతూ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

​గ్రామగ్రామాన పార్టీ జెండా ఆవిష్కరణ ​మండల కేంద్రంలోని పూసాల రోడ్డుతో పాటు కాట్నాపల్లి, గర్రెపల్లి, రేగడి మద్దికుంట, అల్లిపూర్, కోదురుపాక, ఐతారాజ్ పల్లి, గొల్లపల్లి, రామునిపల్లి తదితర గ్రామాల్లోని బూత్ స్థాయిలో వేడుకలను నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.

​దేశ ప్రయోజనాలే లక్ష్యం: పార్టీ నాయకులు

​ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నేతలు మాట్లాడుతూ, శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా దేశభక్తి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజపేయి తొలి అధ్యక్షునిగా ఏర్పడిన బీజేపీ, నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని కొనియాడారు. గత పదేళ్ల మోదీ పాలనలో దేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఇనుమడించిందని వారు తెలిపారు.

​పాల్గొన్న ముఖ్య నేతలు

​ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి, మిట్టపల్లి ప్రవీణ్, కామని రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ​అలాగే రూరల్ బీజేపీ నాయకులు చాతరాజు రమేష్, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్, కొమ్మిడి రాజేందర్ రెడ్డి, వడ్లకొండ శశివర్ధన్, మల్క భాగ్యలక్ష్మి, పెరక రమేష్, మారం రమేష్, ఏనుగు రాజిరెడ్డి, వీరగోని కిరణ్, డాక్టర్ బుమయ్య, మనోహర్, శేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story