Hydrogen cooking stove India: ఇకపై గ్యాస్ సిలిండర్, ఇండక్షన్ స్టవ్ తో పనిలేదు.. నీటితో నడిచే సరికొత్త 'హైడ్రోజన్ పొయ్యి' వచ్చేసింది..!

Hydrogen cooking stove India: ప్రస్తుతం ప్రపంచం అంతా గ్యాస్ కొరత వేధిస్తోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేవలం నీరు, విద్యుత్తును ఉపయోగించి పనిచేసే 'హైడ్రోజన్ కుకింగ్ స్టవ్' మార్కెట్ లోకి వచ్చేసింది.

Venkat
Published on: 9 April 2026 7:42 PM IST
Hydrogen cooking stove India
X

Hydrogen cooking stove India

Hydrogen cooking stove India: వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఎల్‌పీజీ సిలిండర్లు లేదా ఇండక్షన్ స్టవ్‌లతో సంబంధం లేకుండా, కేవలం నీరు, విద్యుత్తును ఉపయోగించి పనిచేసే 'హైడ్రోజన్ కుకింగ్ స్టవ్'ను ఒక భారతీయ సంస్థ పరిచయం చేసింది. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా వంట గదిలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

హైడ్రోజన్ స్టవ్ అంటే ఏమిటి..? ఇది ఎలా పనిచేస్తుంది..?

భారతదేశానికి చెందిన 'గ్రీన్ వైజ్' (Greenvize) అనే చమురు, సహజ వాయువు సంస్థ ఈ వినూత్నమైన పొయ్యిని తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో గ్యాస్‌ను నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు లేదా పైపులైన్ కనెక్షన్ అవసరం లేదు. ఈ వ్యవస్థలో 'ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్' (PEM) అనే ఎలక్ట్రోలైజర్ ఉంటుంది. మీరు పొయ్యిని ఆన్ చేయగానే, ఇది విద్యుత్తు సహాయంతో నీటిలోని అణువులను విడగొట్టి తక్షణమే హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేస్తుంది.

నీరు, విద్యుత్తుతోనే వంట..

ఈ పరికరం పనిచేయడానికి సుమారు 100 మిల్లీలీటర్ల శుద్ధి చేసిన నీరు (RO water), ఒక యూనిట్ విద్యుత్తు సరిపోతుంది. ఈ పరిమాణంతో దాదాపు 6 గంటల పాటు నిరంతరంగా వంట చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ పొయ్యిని నేరుగా ఇంటి పైకప్పుపై ఉండే సోలార్ ప్యానెల్స్‌కు కూడా అనుసంధానించవచ్చు, తద్వారా ఖర్చు మరింత తగ్గుతుంది.

పర్యావరణ హితం, స్వచ్ఛమైన గాలి..

సాధారణ పొయ్యిల నుంచి పొగ లేదా కార్బన్ వంటి వ్యర్థాలు వెలువడతాయి. కానీ, హైడ్రోజన్ పొయ్యి నుంచి ఎటువంటి పొగ రాదు. కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. అంతేకాకుండా, ఈ ప్రక్రియలో ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. ఇది వంటగదిలోని గాలిని శుద్ధి చేసి తాజాదనాన్ని ఇస్తుంది.

ఇండక్షన్ స్టవ్ కంటే ఇది ఎలా భిన్నమైనది?

ఇండక్షన్ పొయ్యిలు నేరుగా విద్యుత్తును వేడి కోసం ఉపయోగిస్తాయి. కానీ ఈ హైడ్రోజన్ వ్యవస్థ విద్యుత్తును ఇంధనంగా మార్చి వంట చేస్తుంది. ఇది తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటూ అధిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. భారత ప్రభుత్వం చేపట్టిన 'నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్'లో భాగంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు.

ధర..

ప్రస్తుతానికి ఈ సాంకేతికత కొత్తది కాబట్టి దీని ధర సామాన్యులకు కొంచెం భారంగానే ఉంది.

ఒక బర్నర్ ఉన్న పొయ్యి ధర సుమారు 1,05,000 రూపాయలు.

♦ రెండు బర్నర్లు ఉన్న వెర్షన్ ధర దాదాపు 1,50,000 రూపాయల వరకు ఉంటుంది.

భవిష్యత్తులో ఈ సాంకేతికత మరింత అందుబాటులోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ల కొరత ఉన్న ప్రాంతాల్లో, ఫుడ్ బిజినెస్ కంపెనీళకు ఇది గొప్ప ప్రత్యామ్నాయంగా మారుతుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story