Vangara: పోలీసుల వేధింపుల వల్లే ఈ అఘాయిత్యం కుటుంబ సభ్యుల ఆరోపణ!
Vangara: శ్రీకాకుళం జిల్లా వంగర పోలీస్ స్టేషన్ మెట్లపై కిమిడి సునీల్ అనే యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Vangara: పోలీసుల వేధింపుల వల్లే ఈ అఘాయిత్యం కుటుంబ సభ్యుల ఆరోపణ!
Vangara: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర పోలీస్ స్టేషన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విచారణ పేరుతో పదేపదే పోలీస్ స్టేషన్కు పిలిచి వేధించారంటూ ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీస్ స్టేషన్ మెట్లపైనే తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపగా, బాధితుడి కుటుంబ సభ్యులు వంగర ఎస్సైపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర పోలీస్ స్టేషన్ ఆవరణలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. తలగాం గ్రామానికి చెందిన కిమిడి సునీల్ అనే యువకుడు పోలీసుల వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ మెట్లపైనే గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన అతడిని స్థానికులు వెంటనే రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఐదేళ్ల క్రితం సునీల్పై పోక్సో కేసు నమోదైంది. అనంతరం సంబంధిత యువతి మేజర్ అయిన తర్వాత ఇద్దరూ వివాహం చేసుకుని కలిసి జీవిస్తున్నారని తెలిపారు. ఇటీవల అత్తవారింటి ఆస్తి విషయంలో కుటుంబ వివాదం నెలకొనగా, అదే వ్యవహారంలో వంగర ఎస్సై షేక్ శంకర్ జోక్యం చేసుకుని పాత కేసును ప్రస్తావిస్తూ సునీల్ను పదేపదే పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధించారని ఆరోపించారు.
ఆస్తి వివాదంలో ఒక వర్గానికి అనుకూలంగా ఒత్తిడి తెచ్చారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే బాధితుడి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై వంగర పోలీసుల అధికారిక వివరణ ఇంకా వెలువడలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.




