Tekkali: టెక్కలిలో హోరెత్తిన 'డిజిటల్ మహానాడు
Tekkali: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపుతో డిజిటల్ మహానాడు వేడుకలు అద్భుతంగా విజయవంతమయ్యాయి.
Tekkali: టెక్కలిలో హోరెత్తిన 'డిజిటల్ మహానాడు
Tekkali: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు పిలుపుతో టెక్కలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల పరిధిలో 10 క్లస్టర్లలో డిజిటల్ విధానంలో నిర్వహించిన 'మహానాడు' కార్యక్రమానికి పసుపు సైన్యం వేలాదిగా తరలివచ్చి, తొలిరోజు వేడుకలను అద్భుతంగా విజయవంతం చేసింది.
ఉత్సాహంగా సాగిన డిజిటల్ మహానాడు
బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ మహానాడు కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. నియోజకవర్గంలోని 10 క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ల ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్వహించిన ఈ మహానాడుకు నియోజకవర్గ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది.
కార్యకర్తల్లో జోష్ నింపిన అధినేతల ప్రసంగాలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగాలను శ్రేణులు ఆసక్తిగా తిలకించాయి. అగ్రనేతల దిశానిర్దేశం, ఉత్తేజపూరిత ప్రసంగాలు క్షేత్రస్థాయి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని నింపాయి.
కూటమి ప్రగతి ప్రస్థానంపై వివరణ
గడిచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా నేతలకు, కార్యకర్తలకు వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్వతోముఖాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను డిజిటల్ వేదికల ద్వారా సమగ్రంగా ప్రస్తావించారు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మహానాడు వేడుకల్లో భాగంగా నియోజకవర్గంలోని వివిధ క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విజయాలను చాటిచెప్పేలా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు మరియు దేశభక్తి గీతాలు కార్యకర్తలను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిజిటల్ వేడుకలతో పాటు సమాంతరంగా సాగిన ఈ ప్రదర్శనలు మహానాడు తొలిరోజు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అందరిలోనూ సరికొత్త ఉత్తేజాన్ని నింపాయి. నాలుగు మండలాల పరిధిలో ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.




