Makarampuram: మకరాంపురం సాయి సన్నిధిలో గురుపౌర్ణమి మహోత్సవాలు: సర్వం సిద్ధం చేసిన ఆలయ ధర్మకర్త!

Makarampuram: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాంపురంలో శ్రీ షిరిడి సాయిబాబా గురుపౌర్ణమి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 July 2026 10:08 AM IST
Makarampuram: మకరాంపురం సాయి సన్నిధిలో గురుపౌర్ణమి మహోత్సవాలు: సర్వం సిద్ధం చేసిన ఆలయ ధర్మకర్త!
X

కంచిలి (శ్రీకాకుళం): కంచిలి మండలం మకరాంపురం గ్రామంలో సర్వాంగ సుందరంగా నిర్మించబడిన శ్రీ షిరిడి సాయినాథుని దివ్య సన్నిధానంలో గురుపౌర్ణమి మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ధర్మకర్త బెందాళం రమణ స్వామి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య జరగనున్న ఈ ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.

గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా మంగళవారం సాయంత్రం శ్రీ షిరిడి సాయిబాబా పల్లకీ సేవ నిర్వహించనున్నారు. పల్లకీ సేవలో భాగంగా మకరాంపురం గ్రామ తిరువీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ సాయినాథుని వైభవోపేత ఊరేగింపు నిర్వహించనున్నారు.

వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఐదు గ్రామాలకు చెందిన 150 మంది మహిళా కళాకారులు సంప్రదాయ కోలాట ప్రదర్శనతో భక్తులను అలరించనున్నారు. ఈ ప్రదర్శన ఉత్సవాలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను మరింత పెంచనుంది.

జూలై 29, బుధవారం గురుపౌర్ణమి ప్రధాన వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాత మేలుకొలుపు సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఆలయ ఆస్థాన కళాకారుల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతర భజన కార్యక్రమాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సాయినాథునికి మహామంగళహారతి సమర్పించి, అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బెందాళం రమణ స్వామి మాట్లాడుతూ, గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ షిరిడి సాయినాథుని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందాలని ఆహ్వానించారు. గురుపౌర్ణమి మహోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, గ్రామానికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకురానున్నాయని ఆయన తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఐదు గ్రామాలకు చెందిన 150 మంది మహిళా కళాకారులు సంప్రదాయ కోలాట ప్రదర్శనతో భక్తులను అలరించనున్నారు. ఈ ప్రదర్శన ఉత్సవాలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను మరింత పెంచనుంది.

జూలై 29, బుధవారం గురుపౌర్ణమి ప్రధాన వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాత మేలుకొలుపు సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఆలయ ఆస్థాన కళాకారుల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతర భజన కార్యక్రమాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సాయినాథునికి మహామంగళహారతి సమర్పించి, అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బెందాళం రమణ స్వామి మాట్లాడుతూ, గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ షిరిడి సాయినాథుని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందాలని ఆహ్వానించారు. గురుపౌర్ణమి మహోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, గ్రామానికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకురానున్నాయని ఆయన తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story