Shubman Gill: గిల్ షాకింగ్ డిమాండ్ తో బిత్తరబోయిన బీసీసీఐ.. కొత్త తలనొప్పి షురూ..!

Shubman Gill: టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌.. రాబోయే కీలక టెస్టు సిరీస్‌లకు ముందే బ్యాటర్లకు సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కల్పించాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం.

Venkat
Published on: 2 Sept 2026 4:20 PM IST
Shubman Gill
X

Shubman Gill: గిల్ షాకింగ్ డిమాండ్ తో బిత్తరబోయిన బీసీసీఐ.. కొత్త తలనొప్పి షురూ..!

shubman gill bcci demand: టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌.. రాబోయే కీలక టెస్టు సిరీస్‌లకు ముందే బ్యాటర్లకు సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కల్పించాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. ముఖ్యంగా స్పిన్‌ను ఎదుర్కొనే విషయంలో ఇబ్బందులు పడుతున్న భారత బ్యాటర్లకు ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో జరిగే మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కల్పించాలని గిల్‌ సూచించినట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా ‘ఏ’తోనే ఎందుకంటే?

భారత గడ్డపై గత కొంతకాలంగా టీమ్‌ఇండియా బ్యాటర్లు నాణ్యమైన స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌లను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని గిల్‌ భావిస్తున్నట్లు సమాచారం.

పిచ్‌పై మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ స్పిన్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడితే.. భారత బ్యాటర్లకు మరింత ప్రయోజనం ఉంటుందని గిల్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ఆస్ట్రేలియా ‘ఏ’ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ కారణంగా ఈ ప్రతిపాదనను అమలు చేయడం అంత సులభం కాదని తెలుస్తోంది.

షెడ్యూల్‌తో చిక్కులు..

ఆస్ట్రేలియా ‘ఏ’తో భారత్‌ ‘ఏ’ జట్టు రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఇవి సెప్టెంబరు 22, 29 తేదీల్లో జరగనున్నాయి. మరోవైపు ఇరానీ కప్‌ అక్టోబరు 1 నుంచి 5 వరకు జరగనుంది. రెండో భారత్‌ ‘ఏ’–ఆస్ట్రేలియా ‘ఏ’ మ్యాచ్‌ కూడా ఇదే సమయంలో కొనసాగనుంది.

దీనికి తోడు ఆసియా క్రీడలు, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ వంటి కార్యక్రమాలకు వేర్వేరు భారత జట్లు వెళ్లాల్సి ఉండటంతో టెస్టు ఆటగాళ్లను ‘ఏ’ మ్యాచ్‌లకు పంపడం సెలెక్టర్లకు కష్టంగా మారనుంది.

10-14 రోజుల ప్రాక్టీస్‌ కావాలన్న గిల్‌..

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు కనీసం 10 నుంచి 14 రోజుల సన్నాహక సమయం ఉండాలని గిల్‌, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కోరుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో అది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

న్యూజిలాండ్‌తో మూడో వన్డే ముగిసిన తర్వాత టెస్టు ఆటగాళ్లను వైట్‌బాల్‌ జట్టు నుంచి ముందుగానే విడుదల చేసి, టెస్టులకు సిద్ధమయ్యే అవకాశం కల్పించడం ప్రస్తుతం బీసీసీఐ ముందున్న సాధ్యమైన మార్గంగా కనిపిస్తోంది.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు నవంబరు 19న ప్రారంభం కానుంది. అంతకంటే ముందు కొన్ని రోజులైనా ప్రత్యేకంగా టెస్టు ప్రాక్టీస్‌ లభిస్తే భారత ఆటగాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story