Habshipur: రోడ్డెక్కిన రైతులు హబ్షీపూర్ నేషనల్ హైవేపై రైతుల భారీ ధర్నా
Habshipur: వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హబ్షీపూర్ నేషనల్ హైవే 765 డీజీపై రైతులు ధర్నా చేపట్టారు.
Habshipur: రోడ్డెక్కిన రైతులు హబ్షీపూర్ నేషనల్ హైవేపై రైతుల భారీ ధర్నా
హాబీశీపూర్: వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హబ్షీపూర్ నేషనల్ హైవే 765 డీజీ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నామని. వరి ధాన్యాన్ని కోసుకోచ్చి వరి కొనుగోలు కేంద్రాలలో పోసి 15-20 రోజులుగా కొనుగోలు కేంద్రాలలోనే వడ్ల కుప్పలు ఉన్నాయని, వెంటనే ఐకేపీ సొసైటీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేయడంజరుగుతుందన్నారు.కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో, ప్రారంభమైన చోట కూడా సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
Next Story




