Rampachodavaram: రంపచోడవరం ఆసుపత్రిలో గర్భిణీలకు పండ్ల పంపిణీ!

Rampachodavaram: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు.

Prasanna, Rampachodavaram
Published on: 19 Aug 2026 8:33 AM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోడవరం ఆసుపత్రిలో గర్భిణీలకు పండ్ల పంపిణీ!

Rampachodavaram: రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలకు వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ వేదాగ్ని ట్రస్ట్ అధినేత మంజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గర్భిణీల ఆరోగ్యం, పోషకాహారం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, వారికి పండ్లు అందజేశారు. సమాజ సేవే లక్ష్యంగా వేదాగ్ని ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేదాగ్ని ట్రస్ట్ ఇంచార్జి చిన్నం టోనీ బాబు, చిన్నం కుమారి, పోలేపల్లి లక్ష్మి, సుంకరి దుర్గారెడ్డి, కారం నరసింహ (నాని), ఎస్. రామకృష్ణ, గొర్లె వాహిని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story