Rampachodavaram: వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం!
Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు పండ్లు పంపిణీ చేశారు.
Rampachodavaram: వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం!
Rampachodavaram: పోలవరం జిల్లా, రంపచోడవరం వేదాగ్ని ట్రస్ట్ అధినేత మంజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా గర్భిణీల ఆరోగ్యం పోషకాహారం ఎంతో అవసరమని పేర్కొంటూ వారికి పండ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వేదాగ్ని ట్రస్ట్ ఇంచార్జ్ చిన్నంటోనీ బాబు, చిన్నం కుమారి, పోలేపల్లి లక్ష్మి, సుంకరి దుర్గారెడ్డి, కె. నరసింహమూర్తి (నాని) పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సమాజ సేవ లక్ష్యంగా వేదాగ్ని ట్రస్ట్ భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.
Next Story




