PGannavaram: పి.గన్నవరంలో ఘనంగా 'రెండేళ్ల నమ్మకం' డోర్ టూ డోర్

PGannavaram: డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం పితాని వారి పాలెంలో 'రెండేళ్ల నమ్మకం' పేరుతో డోర్ టూ డోర్ కార్యక్రమం ప్రారంభం.

RAJU, P GANNAVARAM
Published on: 27 July 2026 6:09 PM IST
PGannavaram
X

PGannavaram: పి.గన్నవరంలో ఘనంగా 'రెండేళ్ల నమ్మకం' డోర్ టూ డోర్

పి. గన్నవరం: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా... పి. గన్నవరం. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్బంగా రెండేళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు పేరుతో డోర్ టు డోర్ అనే కార్యక్రమం పి. గన్నవరం పితాని వారి పాలెం లో ప్రారంభించారు.

డోర్ టు డోర్ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా కార్యదర్శి గంధం పల్లంరాజు, నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ పాల్గొన్నారు.

రోజుకు 30 ఇళ్ల సందర్సన లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ లో భాగంగా సూపర్ సిక్స్, సంక్షేమ పధకాలు అమలు తీరు పై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

కూటమి ప్రభుత్వం పాలన ఇంకా మూడేళ్లు ఉందని, ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మిగిలిన హామీలు ఉన్నాయో అవి నేరవర్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story