Malikipuram: చించినాడ బ్రిడ్జిపై ఫోన్, చెప్పులు వదిలి కొత్తపెళ్లికొడుకు అదృశ్యం!

Malikipuram: మలికిపురం మండలం దిండి-చించినాడ బ్రిడ్జిపై దేవ వికాస్ అనే యువకుడు అదృశ్యం. వారం క్రితమే పెళ్లయిన యువకుడి కోసం గోదావరిలో పోలీసుల గాలింపు.

PRABHU, RAZOLE
Published on: 9 Sept 2026 3:21 PM IST
Malikipuram
X

Malikipuram: చించినాడ బ్రిడ్జిపై ఫోన్, చెప్పులు వదిలి కొత్తపెళ్లికొడుకు అదృశ్యం!

Malikipuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండి గ్రామానికి చెందిన దేవ వికాస్ దిండి– చించినాడ బ్రిడ్జిపై చెప్పులు, సెల్‌ఫోన్ వదిలి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది.

వికాస్‌కు వారం రోజుల క్రితమే వివాహం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల వివాహం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

బ్రిడ్జిపై వికాస్‌కు చెందిన చెప్పులు, సెల్‌ఫోన్ లభించడంతో అతను గోదావరి నదిలోకి వెళ్లాడా? లేక మరో ప్రాంతానికి వెళ్లిపోయాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వికాస్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

దిండి–చించినాడ బ్రిడ్జి వద్ద ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story