Malikipuram: బాధితులకు అండగా వసుధ ఫౌండేషన్ రూ.24 వేల ఆర్థిక సాయం పంపిణీ!
Malikipuram: మలికిపురంలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.24 వేల ఆర్థిక సాయం అందజేత.
Malikipuram: బాధితులకు అండగా వసుధ ఫౌండేషన్ రూ.24 వేల ఆర్థిక సాయం పంపిణీ!
Malikipuram: అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం రూ.24 వేల ఆర్థిక సాయం అందించారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, మలికిపురం లో వసుధ ఫౌండేషన్ కన్వీనర్ జంపన బుజ్జిరాజు ఇంటి వద్ద ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
వైద్య ఖర్చుల నిమిత్తం వి.వి.మెరకకు చెందిన చెవ్వాకుల పాపయమ్మకు రూ.10 వేలు, గొల్లపాలెంకు చెందిన వడ్డీ శ్రీనివాస్కు రూ.7 వేలు, దిండి గ్రామానికి చెందిన ముప్పిరి వెంకటరెడ్డికి రూ.7 వేల చొప్పున వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు వసుధ ఫౌండేషన్ చైర్మన్ (హైదరాబాద్) మంతెన రామరాజు, కన్వీనర్ జంపన బుజ్జిరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోనం రాజు, రాపాక చిన్ని, విజ్జేశ్వరపు అరుణ్కుమార్, ముప్పిరి సందీప్ తదితరులు పాల్గొన్నారు.




