Malikipuram: అనారోగ్య బాధితులకు వసుధ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
Malikipuram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో అనారోగ్య బాధితులకు రూ.70 వేల ఆర్థిక సహాయం అందజేసిన వసుధ ఫౌండేషన్.
Malikipuram: అనారోగ్య బాధితులకు వసుధ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
మలికిపురం: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లోని పలువురు అనారోగ్య బాధితులకు వసుధ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించింది. బుధవారం (ఆగస్టు 5, 2026) మలికిపురం గ్రామంలో వసుధ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీ జంపన బుజ్జిరాజు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో, వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ మంతెన వెంకట రామరాజు మంజూరు చేసిన ఆర్థిక సహాయ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు.
సహాయం పొందిన వారు:
మన్నె చంద్రరావు (ఇరుసుమండ) – ₹10,000
బెల్లంకొండ జోషిత (లక్కవరం) – ₹10,000
మందపాటి నాగేశ్వరరావు (లక్కవరం) – ₹10,000
బొరుసు శ్రీను (బట్టేలంక) – ₹10,000
కొల్లు సోమేశ్వరరావు (కె. తూర్పుపాలెం) – ₹10,000
రావి బసవయ్య (శృంగవరప్పాడు) – ₹10,000
ఏడిద శ్రీనివాసరావు (పెదపట్నంలంక) – ₹10,000
మొత్తం రూ.70,000లను ఏడు మంది బాధితుల కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ ప్రతినిధులు జంపన బుజ్జిరాజు, బోనం రాజు, పల్లపోతు జైదీప్, వీరా కృష్ణ, రాపాక చిన్ని, పాలపర్తి శేఖర్ బాబు, దంగేటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
తమ అనారోగ్య పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులను గుర్తించి చేయూతనందించిన వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ మంతెన వెంకట రామరాజుకు బాధిత కుటుంబాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




