Singarayakonda: శ్రీ చైతన్య స్కూల్ వద్ద మృతుడు తౌశిక్ తల్లి న్యాయపోరాటం

Singarayakonda: సింగరాయకొండ శ్రీ చైతన్య స్కూల్ ముందు నాలుగో రోజూ విద్యార్థి తౌశిక్ తల్లి మౌలాబి దీక్ష. అనుమతులు లేని హాస్టల్‌ను మూసివేయాలని, న్యాయం చేయాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Aug 2026 3:57 PM IST
Singarayakonda
X

Singarayakonda: శ్రీ చైతన్య స్కూల్ వద్ద మృతుడు తౌశిక్ తల్లి న్యాయపోరాటం

సింగరాయకొండ: సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ స్కూల్ ముందు నాలుగు రోజులుగా మృతుడు తౌశిక్ (విద్యార్థి) తల్లి మౌలాబి న్యాయ పోరాటం... తమ కుమారుడు మృతికి న్యాయం జరగాలంటూ నాలుగు రోజులుగా స్కూలు ముందు న్యాయపోరాటం చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన..

తన కుమారుడు చనిపోయిన స్కూల్ హాస్టల్ లో యాజమాన్యం "హాస్టల్ పర్మిషన్లు" లేకుండా 120 మందికి పైగా విద్యార్థులను ఉంచి విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడుకుంటున్నారని తన బిడ్డ కు జరిగిన అన్యాయం మరి ఏ బిడ్డకు జరగకూడదని అనుమతులు లేని హాస్టల్ ను వెంటనే మూసివేయాలని.. అందుకు విద్యాశాఖ అధికారులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

యాజమాన్యం ఒత్తిడితో శాంతియుతంగా పోరాటం చేస్తున్న తనపై పోలీసులు సైతం కేసులు పెట్టాలని చూస్తున్నారని.. తనపై ఏన్ని కేసులు పెట్టిన తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తూ ఉంటానని అప్పటివరకు స్కూల్ ముందు నుండి లేచేది లేదంటున్న మౌలాభి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story