Markapuram: మార్కాపురంలో ఘనంగా ఉచిత విద్యా సామగ్రి పంపిణీ

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏకలవ్య నగర్ మున్సిపల్ హైస్కూల్‌లో పాఠశాలల పునఃప్రారంభం విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 12 Jun 2026 4:22 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో ఘనంగా ఉచిత విద్యా సామగ్రి పంపిణీ

Markapuram: విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ – ఏకలవ్య నగర్‌లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల పునఃప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు తదితర విద్యా సామగ్రితో కూడిన కిట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మార్తల శ్రీనివాస రెడ్డి, పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్ శ్రీ మాలపోలు శాంత కుమార్ పాల్గొని విద్యార్థులకు విద్యా కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మార్తల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు వంటి సౌకర్యాలను ఉచితంగా అందించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

విద్యార్థులు ప్రభుత్వం అందించిన విద్యా సామగ్రిని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. క్రమశిక్షణతో చదువులో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ఎస్‌ఎంసీ చైర్మన్ మాలపోలు శాంత కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ప్రారంభమైన రోజే విద్యా సామగ్రి పంపిణీ చేయడంతో విద్యా కార్యక్రమాలు సజావుగా ప్రారంభమయ్యాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story