Giddalur: గిద్దలూరులో ఘనంగా యోగా వేడుకలు.. తరలివచ్చిన అధికారులు

Giddalur: ప్రకాశం జిల్లా గิద్దలూరు పురపాలక సంఘం పరిధిలోని పుణ్యక్షేత్రమైన పాతాళ నాగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 21 Jun 2026 12:17 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో ఘనంగా యోగా వేడుకలు.. తరలివచ్చిన అధికారులు

గిద్దలూరు: పురపాలక సంఘం పరిధిలోని పుణ్యక్షేత్రమైన పాతాళ నాగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఒత్తిడితో కూడిన నేటి జీవన విధానంలో యోగాసనాలు మరియు ధ్యానం ద్వారా ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల తహసిల్దార్ ఎం. ఆంజనేయరెడ్డి, ఎంపీడీఓ సీతారామయ్య , ఆలయ ఈఓ శ్రీనివాసులు పాల్గొని యోగా యొక్క విశిష్టతను కొనియాడారు. అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పలు యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story