Markapur: మార్కాపురంలో అటవీ శాఖ అధికారుల ఘన సన్మానం

Markapur: ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రాలు అందుకున్న మార్కాపురం రేంజ్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి, డీడీ అబ్దుల్ రౌఫ్‌లను ఘనంగా సన్మానించిన ఏపీజీఈఏ నాయకులు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 17 Aug 2026 9:19 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో అటవీ శాఖ అధికారుల ఘన సన్మానం

మార్కాపురం: అటవీ శాఖలో ఉత్తమ సేవలు అందించి ప్రశంసా పత్రాలు అందుకున్న ఇద్దరు అటవీ శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) నాయకులు ఘనంగా సన్మానించారు.

మార్కాపురం అటవీ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మార్కాపురం రేంజ్ ఆఫీసర్ ఎస్. పిచ్చిరెడ్డి ఉత్తమ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ఎంపికై, డిప్యూటీ డైరెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. అలాగే మార్కాపురం ప్రాజెక్ట్ టైగర్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.డి. అబ్దుల్ రౌఫ్, IFS ఉత్తమ జిల్లా అటవీ అధికారిగా ఎంపికై, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.

ఈ సందర్భంగా ఇద్దరు అధికారులను APGEA నాయకులు ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణతో పాటు శాఖా పరంగా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఉత్తమ అధికారులుగా ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో APGEA కంభం తాలూకా అధ్యక్షులు ముక్కు ప్రసాదరెడ్డి, సెక్రటరీ ఆర్డీ. ప్రకాష్, సభ్యులు మార్కు సామేల్, మార్కాపురం తాలూకా అధ్యక్షులు చేంచిరెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్లు, సభ్యులు సుదర్శన్ రెడ్డి, జిల్లా నాయకులు ఎస్.వి. రమణారెడ్డితో పాటు ఇతర సంఘ నాయకులు, సభ్యులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందుకున్న అటవీ శాఖ అధికారులను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సన్మానించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత బాధ్యతతో ప్రజలకు, పర్యావరణ పరిరక్షణకు సేవలందించే స్ఫూర్తి కలుగుతుందని APGEA నాయకులు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story