Markapuram: వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంపై జేసీ ప్రత్యేక దృష్టి!
Markapuram: మార్కాపురం MEPMA కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.
Markapuram: వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంపై జేసీ ప్రత్యేక దృష్టి!
మార్కాపురం జిల్లా: మార్కాపురంలోని ఎంఈపీఎంఏ (MEPMA) కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ (Swachh Survekshan Survey) సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్లో మార్కాపురం మున్సిపాలిటీ మెరుగైన ర్యాంకు సాధించేలా పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని అంశాల్లో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మున్సిపల్ సిబ్బంది, ఎంఈపీఎంఏ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




