Markapuram: స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!

Markapuram: మార్కాపురం ఎస్వీకేపీ కళాశాలలో నిర్వహించనున్న 78వ స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పరిశీలించి పలు సూచనలు చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 4 Aug 2026 4:27 PM IST
Markapuram
X

Markapuram: స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!

మార్కాపురం: మార్కాపురం జిల్లాలో ఈ నెల 15వ తేదీన మార్కాపురం పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాలలో నిర్వహించనున్న 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మంగళవారం పరిశీలించారు. కార్యక్రమ స్థలాన్ని సందర్శించి అధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మార్కాపురంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. వేడుకల్లో ఆకట్టుకునే విధంగా వివిధ శాఖల శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తిని చాటే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story