Markapuram: వెలిగొండ నిర్వాసిత గ్రామాల్లో కలెక్టర్ విజయ సునీత పర్యటన!

Markapuram: వెలిగొండ నిర్వాసిత గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Sept 2026 2:19 PM IST
Markapuram
X

Markapuram: వెలిగొండ నిర్వాసిత గ్రామాల్లో కలెక్టర్ విజయ సునీత పర్యటన!

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన గుండంచర్ల, సుంకేసుల, పుచ్చకాయలపల్లి స్వర్ణ, గొట్టిపడియ గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పంపిణీ చేశారు.

గుండంచర్ల, సుంకేసుల గ్రామాల పింఛన్‌దారులకు దేవరాజుగట్టు ప్రభుత్వ పాఠశాల వద్ద, పుచ్చకాయలపల్లి స్వర్ణ గ్రామ పింఛన్‌దారులకు స్వర్ణ గ్రామ కార్యాలయం వద్ద, గొట్టిపడియ గ్రామ పింఛన్‌దారులకు కొలభీమునిపాడు స్వర్ణ గ్రామ కార్యాలయం వద్ద పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శివన్నారాయణ, ఎంపీడీవో జాన్ సుందరం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story