Tripuranthakam: నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ పాకనాటి గౌతంరాజ్
Tripuranthakam: త్రిపురాంతకం అంబేద్కర్ కాలనీలో మాజీ ఎంపీపీ నీలం సామెల్ జాన్ కుమారుని వివాహ వేడుక వైభవంగా జరిగింది.
Tripuranthakam: నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ పాకనాటి గౌతంరాజ్
Tripuranthakam: త్రిపురాంతకం అంబేద్కర్ కాలనీలో మాజీ ఎంపీపీ నీలం సామెల్ జాన్, చెన్నమ్మ దంపతుల కుమారుని వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు డాక్టర్ పాకనాటి గౌతంరాజ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ పాకనాటి గౌతంరాజ్, వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులను అభినందించారు.
Next Story




