Bodhan: తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏకచక్రేశ్వరాలయం, మారుతి మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Bodhan: తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు!
బోధన్: బోధన్ పట్టణంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. ఏకాదశి సందర్భంగా ఏక చక్రేశ్వరాలయం, మారుతి మందిర్ లో తెల్లవారి నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉపవాస దీక్షలతో ఆలయాలకు వచ్చిన భక్తులకు ఏక చక్రేశ్వరాలయంలో ఆలయ అర్చకులు గణపతి మహరాజ్, మారుతి మందిర్లో ప్రవీణ్ మహారాజులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి అందించారు. పంటలు సుభిక్షంగా ఉండడంతోపాటు వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక అర్చనలు చేశారు.
Next Story




