Banswada: బాన్సువాడలో SIR నోటీసుల వెల్లువ మున్సిపల్ ఆఫీసులో ఓటర్ల సందడి!

Banswada: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో 7,500 మందికి SIR నోటీసులు. నిర్ణీత గడువులోగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కమిషనర్ సూచన.

SALEEM, BANSWADA
Published on: 31 Aug 2026 4:51 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో SIR నోటీసుల వెల్లువ మున్సిపల్ ఆఫీసులో ఓటర్ల సందడి!

Banswada: బాన్సువాడలో SIR నోటీసుల వెల్లువ - మున్సిపల్ ఆఫీసులో ఓటర్ల సందడి. బాన్సువాడ పట్టణంలోనే ఏకంగా 7500 నోటీసులు - నిర్ణీత గడువులోగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి : మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్.

భారత కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) పనులు వేగంగా జరుగుతున్నాయి. బాన్సువాడలో SIR పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 వేలకు పైగా ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించగా, కేవలం బాన్సువాడ పురపాలక కేంద్రంలోనే 24 వేల ఓట్లకు గాను దాదాపు 7500 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. 2002 ఓటర్ జాబితాతో పేర్లు సరిపోలకపోవడం, పేర్లలో తప్పులు, తేడాలు ఉండటమే దీనికి కారణం.

నోటీసులు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా తమ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని, లేకపోతే ఓటర్ జాబితా నుండి పేర్లు శాశ్వతంగా తొలగించబడే ప్రమాదం ఉందని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ హెచ్చరించారు. నోటీసులతో మున్సిపల్ ఆఫీసులో ఓటర్ల రద్దీ నెలకొంది.

ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని, తమ బీఎల్ఓలను సంప్రదించి నోటీసుతో పాటు ధృవీకరణ పత్రాలు వారికి సమర్పించాలని, మరింత సమాచారం కోసం కాలనీ కౌన్సిలర్ లేదా స్థానిక నాయకులను సంప్రదించాలని కమిషనర్ గోపు గంగాధర్ కోరారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story