Udayagiri: వైసీపీ డీఎస్సీ నిరసన ర్యాలీ అడ్డుకున్న పోలీసులు!

Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 10 Aug 2026 9:48 PM IST
Udayagiri
X

Udayagiri: వైసీపీ డీఎస్సీ నిరసన ర్యాలీ అడ్డుకున్న పోలీసులు!

ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉదయగిరిలో ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు.

అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ర్యాలీ ప్రారంభం నుంచి అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య పలుచోట్ల తోపులాట చోటుచేసుకుంది.

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని, డీఎస్సీ నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.ఈ ఆందోళనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయనను పార్టీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు.

ర్యాలీని అడ్డుకునే క్రమంలో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య చోటుచేసుకున్న తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.డీఎస్సీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. ఉదయగిరిలో జరిగిన ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story