Nellore: నెల్లూరు మహిళల రక్షణపై అవగాహన సదస్సు
Nellore: నెల్లూరులో రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు. హింసకు గురైన మహిళలకు సేవలందించే విధానాలపై వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి శిక్షణ.
Nellore: నెల్లూరు మహిళల రక్షణపై అవగాహన సదస్సు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్–జాతీయ మహిళా కమిషన్ (NCW) సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కార్యక్రమం ప్రారంభమైంది.
అవగాహన సదస్సును ప్రారంభించారు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ డా. రాయపాటి శైలజ. ట్రామా-ఇన్ఫార్మ్డ్ కేర్ (హింస, లైంగిక వేధింపులు, గృహహింస, ప్రమాదాలు లేదా ఇతర మానసికంగా తీవ్ర ప్రభావం చూపిన సంఘటనలు), మానసిక ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, హింసకు గురైన మహిళలకు సమర్థవంతమైన సేవలందించే విధానాలపై శిక్షణ ఇచ్చారు.
14 జిల్లాలకు చెందిన వన్ స్టాప్ సెంటర్ (సఖి) లీగల్ అడ్వైజర్లు, కౌన్సిలర్లు హాజరు అయ్యారు. నిష్ణాతులైన వైద్యులు, నిపుణులచే అవగాహన... ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
Next Story




