Nellore: ఏపీ స్టూడెంట్ జేఏసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రేవూరు నితీష్!

Nellore: ఏపీ స్టూడెంట్ జేఏసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రేవూరు నితీష్ కుమార్ నియామకం. జిల్లా అధ్యక్షుడు కూరపాటి గోపాల్ వెల్లడి.

Yellayya, Nellore
Published on: 12 Sept 2026 7:24 AM IST
Nellore
X

Nellore: ఏపీ స్టూడెంట్ జేఏసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రేవూరు నితీష్!

Nellore: నెల్లూరు జిల్లా ఏపీ స్టూడెంట్స్ జేఏసీ (రిజిస్టర్ నెంబర్: 154 ఆఫ్ 2015) నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అలాగే వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా శ్రీ రేవూరు నితీష్ కుమార్ గారిని శుక్రవారం అధికారికంగా నియమించినట్లు జిల్లా అధ్యక్షులు శ్రీ కూరపాటి గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలతో పాటు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఏపీ స్టూడెంట్స్ జేఏసీ బాధ్యతలను శ్రీ రేవూరు నితీష్ కుమార్ నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు.

Yellayya, Nellore

Yellayya, Nellore