Nellore: పేకాట స్థావరంపై పోలీసులు దాడి నలుగురు వ్యక్తులు అరెస్ట్
Nellore: నెల్లూరు జిల్లా వింజమూరు మండల పరిధిలోని ఎర్రబెల్లిపాలెం శివారు పంట పొలాల్లో సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.
Nellore: పేకాట స్థావరంపై పోలీసులు దాడి నలుగురు వ్యక్తులు అరెస్ట్
Nellore: నెల్లూరు జిల్లా వింజమూరు మండల పరిధిలోని ఎర్రబెల్లిపాలెం శివారులో పంట పొలాల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6,300 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు అందిన గోప్య సమాచారం మేరకు వింజమూరు ఎస్సై ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పోలీసులు నిర్వహించిన ఈ దాడి స్థానికంగా చర్చనీయాంశమైంది.




